News August 28, 2024
రైలు పట్టాలు తప్పేలా ప్లాన్.. రైతు సంఘం నాయకుడి కుమారుడు అరెస్టు

యూపీలో ఆగస్టు 24న రైలు పట్టాలపై పెద్ద చెట్టు కొమ్మను ఉంచిన నిందితులు పోలీసులకు చిక్కారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు రైతు సంఘం నాయకుడి కుమారుడు డియో సింగ్, మరొకరు మోహన్ కుమార్ అని పోలీసులు వెల్లడించారు. కాగా, యూపీ ఫరూఖాబాద్లో మద్యం మత్తులో ప్యాసింజర్ ట్రైన్ కింద 30 కేజీల చెట్టు కొమ్మను ఉంచి రైలు పట్టాలు తప్పేలా ప్లాన్ చేశారు. లోకో పైలట్లు గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Similar News
News October 16, 2025
మీనాక్షితో సురేఖ భేటీ

TG: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను మీనాక్షికి వివరించారు. తన ఇంటికి పోలీసులు రావడం, అక్కడ జరిగిన వివాదంపై చర్చించారు. తన కూతురు వ్యాఖ్యలపైనా సురేఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొండా సురేఖ <<18009181>>వివాదంపై<<>> ఏఐసీసీ నివేదిక అడిగిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
News October 16, 2025
స్మృతి, అభిషేక్కు ICC POTM అవార్డ్స్

సెప్టెంబర్కు గాను ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ ఇండియన్ ఓపెనర్స్ను వరించాయి. మెన్స్ విభాగంలో అభిషేక్ శర్మ, ఉమెన్స్ విభాగంలో స్మృతి మంధాన ఎంపికయ్యారు. గత నెల ఆసియా కప్లో అద్భుత ప్రదర్శనతో కుల్దీప్, బెన్నెట్(ZIM)ను వెనక్కినెట్టి అభిషేక్ అవార్డు సాధించారు. అటు స్మృతి SEPలో 77 Avgతో 308 రన్స్ చేసి పాక్ ప్లేయర్ సిద్రా, SA స్టార్ టాజ్మిన్ బ్రిట్స్ను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నారు.
News October 16, 2025
AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు సుప్రీంలో పిటిషన్

అహ్మదాబాద్లో 260 మందికి పైగా మరణించిన AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ ఫ్లైట్ కెప్టెన్ సుమీత్ తండ్రి పుష్కర్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. AAIB దర్యాప్తు సరిగా లేదని, పైలెట్ల లోపం వల్లే ప్రమాదం అన్న రీతిలో దాని ప్రాథమిక నివేదిక ఉందని తప్పుబట్టారు. ఆ దర్యాప్తును నిలిపి, న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నిపుణులతో స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఆయనతో పాటు FIP కూడా కోర్టులో పిటిషన్ వేసింది.