News May 21, 2024
ఐదో దశ ఎన్నికల పోలింగ్ 60.09 శాతం

దేశవ్యాప్తంగా నిన్న జరిగిన ఐదో దశ ఎన్నికల పోలింగ్లో 60.09శాతం పోలింగ్ (రాత్రి 11.30 గంటల వరకు) నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా 74.65 శాతం మంది ఓటేశారు. బీహార్లో(5 స్థానాలు) 54.85%, జమ్ము&కశ్మీర్లో(ఒక స్థానం) 56.73%, జార్ఖండ్లో(3) 63.07%, మహారాష్ట్రలో(13) 54.29%, ఒడిశాలో(05) 67.59శాతం, యూపీలో(14) 57.79శాతం పోలింగ్ నమోదైంది.
Similar News
News November 2, 2025
నేడు బిహార్లో ప్రధాని మోదీ ప్రచారం

నేడు ప్రధాని మోదీ బిహార్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News November 2, 2025
ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.
News November 2, 2025
క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.


