News September 12, 2025

గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

image

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.

Similar News

News March 31, 2026

గుడ్ న్యూస్: ‘చేనేత’కు రేపట్నుంచి ‘ఫ్రీ పవర్’

image

AP: చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకం రేపట్నుంచి అమలు కానుంది. నెలకు మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల చొప్పున GOVT ఫ్రీగా అందించనుంది. ఇందుకు ఏడాదికి దాదాపు ₹150CR వెచ్చించనుంది. 93,000 మగ్గాల కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ ఫ్యామిలీలకు లబ్ధి కలుగుతుంది. ఏడాదికి ఒక్కో మగ్గం యూనిట్‌కు రూ.8,640 వరకు, పవర్ లూమ్ యూనిట్‌కు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

News March 31, 2026

కలెక్షన్ల సునామీ.. చరిత్ర సృష్టించిన ధురంధర్-2!

image

‘ధురంధర్-2’ రూ.1,390CR(గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. ఫస్ట్ పార్ట్ లైఫ్‌టైమ్ వసూళ్ల(రూ.1,350CR)ను 12 రోజుల్లోనే అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల లిస్టులో 4వ స్థానానికి చేరింది. తొలి 3 స్థానాల్లో దంగల్, బాహుబలి-2, పుష్ప-2 ఉన్నాయి. ఇక కర్ణాటకలో రూ.100+CR సాధించిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది.
-ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.

News March 31, 2026

వందే భారత్‌లో ఫుడ్.. అలెర్జీకి గురైన యువతి ఫొటో వైరల్

image

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో <<19481891>>ఫుడ్<<>> తిన్న తర్వాత అలెర్జీకి గురైనట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. పెదవులు ఉబ్బిపోయిన ఫొటో, మెడికల్ బిల్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలవుతున్నాయి. ‘వందే భారత్‌లో ఇచ్చే ఆహారం అత్యంత నాసిరకం. ఫిర్యాదు చేస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు’ అని ఆమె వాపోయారు. తన బిడ్డతో కలిసి దేవ్‌గఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.