News May 23, 2024

రూ.2లక్షలకు చేరనున్న తులం బంగారం ధర?

image

పది గ్రాముల బంగారం ధర మరో 9 ఏళ్లలో రూ.2లక్షలకు చేరే అవకాశముందని ఎనలిస్టులు చెబుతున్నారు. చరిత్ర చూస్తే గోల్డ్ ధరలు ప్రతీ 9 ఏళ్లకు 3రెట్లు పెరుగుతోందని, ప్రస్తుతం రూ.70వేలకు పైగా ఉన్న 10gms గోల్డ్ రేటు, 2033 నాటికి రూ.2.1లక్షలకు చేరొచ్చని అంచనా వేశారు. 2015లో ఈ ధర రూ.24,740 ఉండగా, 2023 నాటికి 3 రెట్లు పెరిగిందని, అంతకుముందు కూడా ఇదే ట్రెండ్ కనిపించిందని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

కర్నూలు: ‘ఆ మండలం మాకొద్దు’

image

ఆదోని మండల విభజనపై ఆందోళనలు <<18458309>>ఉద్ధృతం<<>> అవుతున్నాయి. 17 గ్రామాలతో పెద్ద హరివణం మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. మదిరె, నాగనాథహళ్లి, గణేకల్ తదితర గ్రామాల ప్రజలు పెద్దహరివరణం తమకు 30 కి.మీ దూరం వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఆదోని నియోజకవర్గాన్ని ఆదోని రూరల్, అర్బన్, పెద్ద హరివణం, పెద్ద తుంబళం మండలాలుగా విభజించాలని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేస్తున్నారు.

News December 4, 2025

రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

image

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 4, 2025

పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్‌లైన్స్

image

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్‌కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.