News September 27, 2024
వెండి ధర కేజీ రూ.1,02,000

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.430 పెరిగి రూ.77,450కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.71,000 పలుకుతోంది. ఇక వెండి రేటు కేజీ రూ.1,000 పెరిగి రూ.1,02,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News January 24, 2026
అవార్డు అందుకోనున్న జనగామ కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల శిక్షణ, సామర్థ్యాభివృద్ధిలో ఉత్తమ పనితీరుకు గాను జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. జనవరి 25న హైదరాబాద్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. సిబ్బందికి నిరంతర శిక్షణే ఈ గౌరవానికి కారణమని అధికారులు తెలిపారు. కాగా కలెక్టర్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News January 24, 2026
నచ్చని తీర్పిస్తే జడ్జీని బదిలీ చేస్తారా: జస్టిస్ భూయాన్

GOVTకి నచ్చని తీర్పిచ్చారని జడ్జీనెందుకు బదిలీ చేయాలని జస్టిస్ భూయాన్(SC) ఓ వేదికపై ప్రశ్నించారు. అది జుడీషియరీపై ప్రభావం చూపదా అన్నారు. ఇది కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. గత ఏడాది కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన MP మంత్రికి HC జడ్జీ శ్రీధరన్ నోటీసులిచ్చారు. ఆ తర్వాత అలహాబాద్ బదులు ఆయన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేశారు. దీనినే భూయాన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
News January 24, 2026
Photo Gallery: విద్యార్థులతో సీఎం చంద్రబాబు

AP: ఇవాళ నగరి పర్యటనలో CM CBN కాసేపు విద్యార్థులతో గడిపారు. బాలురు, బాలికల పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్ట్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, నెట్ జీరో ఎలక్ట్రిసిటీలో భాగంగా స్కూలుపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్, కంపోస్ట్ పిట్ను పరిశీలించి మాట్లాడారు. హాస్టల్ రూమ్స్, కిచెన్ రూమ్స్ తనిఖీ చేశారు.


