News March 20, 2024

పెరగనున్న ఈ-స్కూటర్ల ధరలు!

image

ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు 10% వరకు పెరగనున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024లో కేంద్రం మార్పులు చేయడం, ఫేమ్-2 స్కీమ్ గడువు ఈనెలాఖరుతో ముగియనుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ స్కీమ్ కింద బైక్‌లపై ₹5,000 నుంచి ₹10వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. ఇప్పుడు దీని గడువు ముగియనున్న నేపథ్యంలో బైక్ తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది

Similar News

News December 31, 2025

ఇంటి చిట్కాలు మీ కోసం..

image

* చెక్క కుర్చీలు జరిపేటప్పుడు వాటి కాళ్ళకు సాక్సులు వేస్తే నేలపై గీతలు పడకుండా ఉంటాయి.
* కత్తెర, చాకు తుప్పు పడితే వాటిని బ్లాక్ టీలో ఉంచి రెండు మూడు గంటలయ్యాక తీసి పొడి వస్త్రంతో శుభ్రపరచండి.
* ఇంటికి పెయింట్ వేసే ముందు అద్దాలను కిరోసిన్ తో తుడిస్తే మరకలు పడినా సులభంగా వదులుతాయి.
* గాజు గ్లాసులు, సీసాలను మెత్తని ఉప్పుతో శుభ్రపరిస్తే గీతలు పడకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.

News December 31, 2025

APPLY NOW: CDFDలో ఉద్యోగాలు

image

HYDలోని BRIC-సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD)లో 2సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 27వరకు పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి MSc, MTech, ఎండీ, MVSc, M.Pham, M.Biotech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdfd.org.in/

News December 31, 2025

శివలింగం ధ్వంసం చేసింది హిందువే: SP

image

AP: ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజీ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.