News March 20, 2024
పెరగనున్న ఈ-స్కూటర్ల ధరలు!

ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు 10% వరకు పెరగనున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024లో కేంద్రం మార్పులు చేయడం, ఫేమ్-2 స్కీమ్ గడువు ఈనెలాఖరుతో ముగియనుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ స్కీమ్ కింద బైక్లపై ₹5,000 నుంచి ₹10వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. ఇప్పుడు దీని గడువు ముగియనున్న నేపథ్యంలో బైక్ తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది
Similar News
News October 28, 2025
సూర్య ఫామ్ లేమిపై ఆందోళన లేదు: గంభీర్

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య బ్యాటింగ్ ఫామ్పై ఆందోళన లేదని హెడ్ కోచ్ గంభీర్ తెలిపారు. ‘ఫియర్లెస్, అగ్రెసివ్గా ఆడాలన్నదే మా ఆలోచన. అలా ఆడినప్పుడు త్వరగా ఔటవ్వడం, మిస్టేక్స్ సహజం. 30 బంతుల్లో 40 రన్స్ చేస్తే విమర్శలకు దూరంగా ఉండొచ్చు. కానీ మా అప్రోచ్ అది కాదు. T20లకు కెప్టెన్గా సూర్య ఫర్ఫెక్ట్. జట్టును బాగా నడిపిస్తున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. AUS, IND మధ్య తొలి T20 రేపు జరగనుంది.
News October 28, 2025
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలు: మంత్రి

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశాం. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10-12% తగ్గిస్తుంది. భూసేకరణను సగానికి తగ్గిస్తుంది. మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు ₹1,500-1,600Cr ఆదా చేస్తుంది’ అని చెప్పారు.
News October 28, 2025
అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
1924: నటి సూర్యకాంతం జననం (ఫొటోలో)
1959: సినీ నటుడు గోవిందరాజు సుబ్బారావు మరణం
☛ అంతర్జాతీయ యానిమేషన్ డే


