News September 14, 2024

ఈ నెల 16న తొలి వందే మెట్రో రైలును ప్రారంభించనున్న ప్రధాని

image

దేశంలో వందే మెట్రో రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 16న అహ్మదాబాద్-భుజ్ మధ్య తొలి ట్రైన్ పరుగులు పెట్టనుంది. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ రైలులో 1,150 మంది కూర్చునేలా సదుపాయం ఉంది. 360 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 110 కి.మీ.ల గరిష్ఠ వేగంతో 5.45 గంటల్లో చేరుకుంటుంది. ఇప్పటికే దేశంలో వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

Similar News

News November 23, 2025

మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

image

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.

News November 23, 2025

పోలీసులకు సవాల్‌ విసురుతున్న MovieRulz

image

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్‌లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్‌లను అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.

News November 23, 2025

నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

image

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.