News February 14, 2025

కొడుకుకొచ్చిన సమస్య.. వైకల్యం ఉన్నవారికోసం ఆశ్రమం!

image

ప్రస్తుతం కొంత మంది పిల్లల్లో పెరుగుదల లేకపోవడం, మాట్లాడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బారిన పడితే ఇలా జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన రవీంద్ర-సుజాత దంపతుల కుమారుడు ఈ వ్యాధితోనే బాధపడుతున్నాడు. దీంతో ఇలాంటి పిల్లల కోసం థానేలో వీరిద్దరూ ఆశ్రమం స్థాపించారు. తల్లిదండ్రుల బాధను అర్థంచేసుకొని ఇక్కడ విద్య, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అందిస్తున్న ఈ జంటను అభినందించాల్సిందే.

Similar News

News October 20, 2025

బిహార్ తొలి విడత ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

దీపావళి సందర్భంగా కేంద్రం PM కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వార్తలు వచ్చినా మోదీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొంది. బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు (నవంబర్ 6) ముందు కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావని వివరించింది.

News October 20, 2025

ఆత్మగౌరవమే కిరీటం! నీ లక్ష్యం కోసం కష్టపడు..

image

మిత్రమా.. ఆత్మగౌరవమే నీకు అసలైన కిరీటం. నిన్ను పట్టించుకోని వారి కోసం అస్సలు వెతకకుండా నిన్ను నువ్వు గౌరవించుకో. అవమానం జరిగితే నిశ్శబ్దంగా ఉండకుండా వెంటనే ధైర్యంగా సమాధానం చెప్పేసేయ్. నీకు సంతోషాన్ని ఇచ్చే పనులనే చెయ్యి. ఇతరుల గురించి మాట్లాడి సమయాన్ని వృథా చేయకుండా, నీ లక్ష్యాల కోసం కష్టపడు. నీ సమయం ఎంతో విలువైనదిగా భావించు. ఎప్పుడూ బిజీగా ఉండి నీ విలువను పెంచుకో! Share it

News October 20, 2025

దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

image

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.