News February 14, 2025
కొడుకుకొచ్చిన సమస్య.. వైకల్యం ఉన్నవారికోసం ఆశ్రమం!

ప్రస్తుతం కొంత మంది పిల్లల్లో పెరుగుదల లేకపోవడం, మాట్లాడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బారిన పడితే ఇలా జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన రవీంద్ర-సుజాత దంపతుల కుమారుడు ఈ వ్యాధితోనే బాధపడుతున్నాడు. దీంతో ఇలాంటి పిల్లల కోసం థానేలో వీరిద్దరూ ఆశ్రమం స్థాపించారు. తల్లిదండ్రుల బాధను అర్థంచేసుకొని ఇక్కడ విద్య, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అందిస్తున్న ఈ జంటను అభినందించాల్సిందే.
Similar News
News September 16, 2025
BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
News September 16, 2025
కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.
News September 16, 2025
దసరా సెలవులు ఎప్పుడంటే?

AP: స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు SEP 28 నుంచి OCT 5 వరకు హాలిడేస్ ఉంటాయి. అటు తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.