News October 20, 2024

వర్షం నిలిచింది.. కొద్ది సేపట్లో మ్యాచ్ మొదలు

image

వర్షం కారణంగా ఇండియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్‌ను 10.15 గంటలకు స్టార్ట్ చేయనున్నారు. తొలి సెషన్ 10.15 నుంచి 12.30 వరకు జరగనుంది. 12.30-1.10 వరకు లంచ్ బ్రేక్ ఉండనుండగా తిరిగి 1.10కి సెకండ్ సెషన్, 3.30కి మూడో సెషన్ జరగనుంది. ఈరోజు మొత్తం 91 ఓవర్లు ఆడనున్నారు.

Similar News

News December 22, 2025

చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు 100% నిజం: అమర్నాథ్

image

AP: చంద్రబాబుపై KCR చేసిన <<18634035>>వ్యాఖ్యలు<<>> 100% నిజమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంతపెద్ద నేత అయ్యారు. KCR వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా’ అని చెప్పారు. జగన్ అంటే కూటమి నేతలు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే వైసీపీలోకి చేరుతున్నారని చెప్పారు.

News December 22, 2025

కొత్త పథకాలపై ప్రభుత్వం కసరత్తు

image

TG: వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 22, 2025

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

image

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రిన్సీ కుమారి (20) ఆత్మహత్య చేసుకుంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆమె బీటెక్ సెకండ్ ఇయర్(CSE) చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. బ్యాక్‌లాగ్‌లు ఉండటంతో పరీక్షల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం. ‘సారీ మమ్మీపప్పా.. మీ అంచనాలు అందుకోలేకపోతున్నా. బాధగా ఉంది. చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది.