News October 20, 2024
వర్షం నిలిచింది.. కొద్ది సేపట్లో మ్యాచ్ మొదలు

వర్షం కారణంగా ఇండియా, న్యూజీలాండ్ మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ను 10.15 గంటలకు స్టార్ట్ చేయనున్నారు. తొలి సెషన్ 10.15 నుంచి 12.30 వరకు జరగనుంది. 12.30-1.10 వరకు లంచ్ బ్రేక్ ఉండనుండగా తిరిగి 1.10కి సెకండ్ సెషన్, 3.30కి మూడో సెషన్ జరగనుంది. ఈరోజు మొత్తం 91 ఓవర్లు ఆడనున్నారు.
Similar News
News December 31, 2025
2025: ESPN వన్డే, టీ20, టెస్ట్ టీమ్స్ ఇవే

ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో టెస్ట్, వన్డే, టీ20 టీమ్స్ను ESPNCRICINFO ప్రకటించింది. టెస్టుల్లో భారత్ నుంచి రాహుల్, గిల్, జడేజా, సిరాజ్, వన్డేల్లో రోహిత్, కోహ్లీ, టీ20ల్లో అభిషేక్, వరుణ్, బుమ్రాను ఎంపిక చేసింది. వన్డేలకు రోహిత్, టెస్టులకు బవుమా, టీ20లకు పూరన్కు కెప్టెన్గా సెలక్ట్ చేసింది. అటు వన్డే, T20ల్లో మహిళా టీమ్స్నూ ప్రకటించింది. పూర్తి టీమ్స్ కోసం పైన స్వైప్ చేయండి.
News December 31, 2025
తలరాతను మార్చిన చదువు.. తల్లిదండ్రులకు అద్భుత బహుమతి

మహారాష్ట్రలో గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టి IPS ఆఫీసర్ అయిన బర్దేవ్ సిద్ధప్ప గుర్తున్నారా? ఇల్లు కూడా లేని ఆయన బీటెక్ పూర్తి చేసి 2024లో యూపీఎస్సీ ఫలితాల్లో IPSగా ఎంపికయ్యారు. ఆ కమ్యూనిటీ నుంచి IPS అయిన తొలి వ్యక్తిగా రికార్డు అందుకున్నారు. తాజాగా తన తల్లిదండ్రులను, ఆత్మీయులను విమానం ఎక్కించారు. విమానం గురించి చిన్నప్పుడు కలలు కనేవాడినని, ఇప్పుడు నిజమైందని సిద్ధప్ప ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
News December 31, 2025
వారెన్ బఫెట్ వీడ్కోలు: వ్యాపార దిగ్గజాలు నేర్చుకున్న పాఠాలివే!

బెర్క్షైర్ హాత్వే CEOగా వారెన్ బఫెట్ తన సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో ముగించనున్నారు. 95 ఏళ్ల వయసున్న ఈ పెట్టుబడి దిగ్గజం నుంచి నేర్చుకున్న పాఠాలను వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పడం, ఓపికతో లాంగ్టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బఫెట్ ప్రత్యేకత. డబ్బు కంటే నైతికతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సంపద మనిషిని బందీ చేయకూడదని నమ్మి.. తన ఆస్తిని దానధర్మాలకు కేటాయించారు.


