News March 10, 2025

జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు: అనగాని

image

AP: జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా విభజన జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు స్థలాలు కేటాయించలేదు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ ప్రభుత్వ కార్యాలయాలపై చూపలేదని ఎద్దేవా చేశారు. అవసరమైన చోట్ల త్వరలో కలెక్టరేట్లు నిర్మిస్తామని తెలిపారు.

Similar News

News December 19, 2025

సొసైటీ పాలకవర్గాలు రద్దు.. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు

image

TG: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు 9 జిల్లాల DCCB పాలకమండళ్లను సైతం తొలగించింది. ఇప్పటికే 2 సార్లు వీటి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు PACSలకు పర్సన్ ఇన్‌ఛార్జులను నియమించి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరిని కొనసాగించాలని పేర్కొంది. త్వరలోనే సొసైటీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

News December 19, 2025

విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న విరాట్, రోహిత్

image

భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ తమ జట్టు తరఫున ఆడతారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. అటు ఈ టోర్నమెంట్‌లో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఆడనున్నారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

News December 19, 2025

₹7,910 కోట్ల ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా పేరు

image

AP: పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా గుర్తుండేలా రాష్ట్రంలో ₹7,910 కోట్లతో చేపట్టే మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా ప్రభుత్వం నామకరణం చేసింది. రానున్న 30 ఏళ్ల నాటికి 5 ఉమ్మడి జిల్లాల పరిథిలో 1.21 కోట్లమంది దాహార్తిని ఈ ప్రాజెక్టు తీర్చనుంది. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలకు ఈ స్కీమ్ ద్వారా మంచినీరు సరఫరా అవుతుంది. జలధార పోస్టర్‌ను Dy CM పవన్ ఆవిష్కరించారు.