News July 22, 2024
రీల్స్ పిచ్చి.. పనిమనిషి ఏం చేసిందంటే?

తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలని రీల్స్ చేయాలనుకుంది ఓ పనిమనిషి. అందుకు మంచి కెమెరా కొనాలనుకుంది. కానీ డబ్బులు లేవు. ఇంకేముంది పనిచేసే ఇంటికే కన్నం వేసింది. ఢిల్లీలోని ఓ బంగ్లాలో పనిచేసే నీతూయాదవ్(30)కు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఈక్రమంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ కావాలని యజమాని ఇంట్లో చోరీ చేసింది. రూ.లక్షల విలువైన నగలతో పరారైంది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
Similar News
News March 30, 2025
సింగరేణి రికార్డ్.. ఒకే రోజు 3.25L టన్నుల బొగ్గు రవాణా

TG: సింగరేణి గనుల నుంచి ఈ నెల 28న 3.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. 136 ఏళ్ల చరిత్రలో ఇదొక రికార్డని పేర్కొన్నారు. అధికారులు, కార్మికుల కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు.
News March 30, 2025
ఇండోనేషియాలోనూ భూకంపం

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్లాండ్, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 30, 2025
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల

TG: ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులను విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్సైట్లో లిస్టును అప్లోడ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.