News November 14, 2024
ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి

రిలయన్స్, డిస్నీ+హాట్స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్పర్సన్గా నీతా అంబానీ, వైస్ ఛైర్పర్సన్గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.
Similar News
News October 31, 2025
దేహంలో దాగి ఉన్న పంచభూతాల లీల

‘ఓం నమ:శివాయ’ అనే 5 అక్షరాలతో మనం శివుణ్ని కొలుస్తాం. ఈ పంచాక్షరీ మంత్రమే పంచభూతాలు కూడా. ఈ పంచభూతాల ఆధారంగానే మన శరీరం నిర్మితమైంది. దీనికి సూచనగా దేవుడు మన చేతికి, కాలికి సహజంగానే ఐదు వేళ్లను ఏర్పరిచాడు! ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇదొకటి. మనిషి ఐదు వేళ్లను కలిగి ఉండటం, ఐదు భూతాలతో తయారవడం… ఇదంతా సృష్టికర్త మనకిచ్చిన దివ్య సంకేతం. మన శరీరమే పరమేశ్వరుని సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అద్భుత రహస్యం! <<-se>>#SIVA<<>>
News October 31, 2025
కేజ్రీవాల్ మరో శీష్ మహల్ కట్టుకున్నారు: బీజేపీ

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు మరో శీష్ మహల్ ఉందని BJP ఆరోపించింది. ఢిల్లీ మహల్ను ఖాళీ చేశాక చండీగఢ్లో 7 స్టార్ బంగ్లాను కేజ్రీవాల్ నిర్మించారని ట్వీట్ చేసింది. 2 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిందని చెప్పింది. ఓ ఏరియల్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీలో CM నివాసాన్ని ₹45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్గా మార్చుకున్నారని గతంలో కేజ్రీవాల్పై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
News October 31, 2025
ప్రకాశం బ్యారేజ్లోకి 4.38L క్యూసెక్కుల వరద

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.


