News July 18, 2024
మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల

AP: శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మొత్తం ఏడు అంశాల్లో ఇప్పటి వరకు నాలుగింటిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు.
Similar News
News December 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 99 సమాధానం

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
సమాధానం: పుష్య మాసం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 17, 2025
ఇంట్లో నుంచే సంపాదిద్దాం..

చాలామంది అమ్మాయిలకు పెళ్లైన తర్వాత కెరీర్ ఆశలకు, ఆశయాలకూ అడ్డుకట్ట పడిపోతుంది. ఇలాంటి వారు ఇంట్లో ఉండే ఆర్థిక స్వేచ్ఛను సాధించొచ్చంటున్నారు నిపుణులు. అందమైన హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చేయడం వస్తే దాన్నే ఉపాధిగా మార్చుకోవచ్చు. ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయగలిగే సత్తా ఉన్నవాళ్లు పార్టీ ఆర్గనైజర్గా మారొచ్చు. కావాల్సిన వాళ్లకి బాల్కనీల్లోనే గార్డెనింగ్ ఏర్పాటు చేసివ్వడం కూడా మంచి ఉపాధి అవకాశం అవుతుంది.
News December 17, 2025
10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు: రైల్వే బోర్డు

రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. ఇన్నాళ్లూ 4 గంటల ముందు చార్టును అందుబాటులో ఉంచేది. దీంతో స్టేషన్కు రావడం, ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం వంటి ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు.


