News July 18, 2024
మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల

AP: శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మొత్తం ఏడు అంశాల్లో ఇప్పటి వరకు నాలుగింటిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటి పారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు.
Similar News
News December 12, 2025
హీరోయిన్పై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు

మలయాళ హీరోయిన్పై గ్యాంగ్ రేప్ <<18502408>>కేసులో<<>> ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన నటుడు దిలీప్ను ఇటీవలే న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. మిగతా నిందితులైన సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజీశ్, సలీమ్, ప్రదీప్కు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2017లో హీరోయిన్పై గ్యాంగ్రేప్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.
News December 12, 2025
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.
News December 12, 2025
మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.


