News September 6, 2024

నెల జీతం విరాళంగా ప్రకటించిన వైసీపీ ప్రజాప్రతినిధులు

image

AP: వరద బాధితులకు వైసీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వైసీపీ చీఫ్ జగన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News January 11, 2026

న్యూజిలాండ్ జట్టులో భారతీయుడు.. ఎవరీ ఆదిత్య?

image

INDతో జరుగుతున్న తొలివన్డేలో న్యూజిలాండ్ జట్టులో మరో భారతీయుడు చోటుదక్కించుకున్నారు. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ 2002 సెప్టెంబర్ 5న వేలూరు(TN)లో పుట్టారు. అతడికి 4 ఏళ్ల వయసప్పుడే ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. 2023 ఆగస్టులో NZ తరఫున టీ20ల్లో, డిసెంబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశారు. అప్పుడప్పుడూ భారత్‌కు వస్తుంటారు. CSK అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. రజినీకాంత్‌కు ఆదిత్య పెద్ద ఫ్యాన్.

News January 11, 2026

ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ అటాక్స్: విజయ్ దేవరకొండ

image

డియర్ కామ్రేడ్ మూవీ నుంచే ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ అటాక్స్ చూసినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీకి టికెటింగ్ యాప్స్‌లో <<18819623>>రేటింగ్<<>> బ్యాన్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘అసలు మనుషులు ఇలా ఎందుకు చేస్తారని మథనపడే వాడిని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. సినిమాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని కోర్టు గుర్తించింది. ఇది పరిష్కారం కాదు.. కేవలం ఉపశమనం మాత్రమే’ అని<> ట్వీట్<<>> చేశారు.

News January 11, 2026

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్(<>HOCL<<>>)20 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 20 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. BE, BTech అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.hoclindia.com