News February 27, 2025

‘తెలుగు’కు దక్కిన గౌరవం

image

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.

Similar News

News January 8, 2026

అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

image

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.

News January 8, 2026

IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<>IREDA<<>>) 10 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BCom, BCA, డిప్లొమా(CS/IT)అర్హతగల వారు JAN 20 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.18వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.16వేలు చెల్లిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. www.ireda.in

News January 8, 2026

పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

image

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.