News June 15, 2024
బాలికపై హత్యాచారం.. సుమోటోగా స్వీకరించిన బాలల హక్కుల కమిషన్
TG: ఆరేళ్ల బాలిక <<13437328>>హత్యాచార<<>> ఘటనను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని పెద్దపల్లి కలెక్టర్ను ఆదేశించింది. కాగా ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఇప్పటికే డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు.
Similar News
News February 1, 2025
ముగిసిన సీఎం సమీక్ష
TG: మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుదీర్ఘంగా జరిగిన భేటీలో వివిధ శాఖలు, రంగాలకు బడ్జెట్ అవసరాలపై చర్చలు జరిపారు. నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
News February 1, 2025
తక్కువ వడ్డీతో రూ.5లక్షల రుణం.. ఇలా చేయండి
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్రం రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. కౌలు రైతులు, భూ యజమాని-సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు. వడ్డీ కేవలం 4శాతం(7శాతంలో 3% కేంద్రం రాయితీ) ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా కార్డు తీసుకోవచ్చు. రూ.2లక్షలలోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు.
News February 1, 2025
APకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి: పవన్
AP: కేంద్ర బడ్జెట్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదంతో ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధుల కేటాయింపుతో ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తేలింది’ అని పవన్ అన్నారు.