News February 8, 2025
ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!

అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ క్యాండిడేట్ చంద్రభాను పాస్వాన్ 61,710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఓటమి తర్వాత ఈ విజయంతో బీజేపీకి ఊరట దక్కింది. మరోవైపు తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థి ఛాందీరకుమార్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
Similar News
News November 5, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల లోపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, MBNR, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?
News November 5, 2025
రేవంత్, కేసీఆర్పై కిషన్ రెడ్డి ఫైర్

TG: ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ప్రచారం సందర్భంగా రేవంత్, KCRపై ఆయన ఫైర్ అయ్యారు. ‘తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు అడిగితే రేవంత్ ఫ్రీ బస్సు అంటున్నారు. అటు కేసీఆర్ పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు కానీ ఆయన కుటుంబీకులు ఫామ్హౌస్లు కట్టుకున్నారు’ అని మండిపడ్డారు.
News November 5, 2025
బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీం కోర్టులో పోరాటానికి నిర్ణయం

TG: AP బనకచర్ల ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నీటిపారుదల, జల వనరుల నిపుణుల నుండి అభిప్రాయం తీసుకుంటోంది. CM రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన ఫైల్ను పంపి ఆయన ఆమోదించిన వెంటనే SCలో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టులపై TG ఇప్పటికే జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.


