News January 6, 2025

జవాన్ల త్యాగం వృథాగా పోదు: అమిత్ షా

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మందుపాతర పేలి <<15079768>>జవాన్లు మరణించిన<<>> ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. జవాన్ల త్యాగం వృథాగా పోదని, వారి లోటును మాటల్లో వర్ణించలేమన్నారు. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ఉద్ఘాటించారు. జవాన్లపై దాడిని పిరికిపంద చర్యగా CG సీఎం విష్ణుదేవ్ వర్ణించారు.

Similar News

News November 11, 2025

మహిళా ఐఏఎస్‌కు గృహ హింస వేధింపులు

image

సామాన్య మహిళలకే కాదు చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న ఉమెన్ బ్యూరోక్రాట్లకు గృహ హింస తప్పట్లేదు. IAS ఆఫీసర్ అయిన తనభర్త ఆశిష్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ IAS భారతి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లో జరిగింది. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశిష్ సామాజిక న్యాయం విభాగంలో డైరెక్టర్ కాగా, భారతి ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

News November 11, 2025

‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.

News November 11, 2025

ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

image

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.