News July 13, 2024
అదే దూకుడు.. అదే బాదుడు!

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైరైనా కంగారూ జట్టుపై చితక్కొట్టడం మాత్రం మర్చిపోలేదు. లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో నిన్నటి సెమీఫైనల్లో యువీ 28బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేశారు. దీంతో భారత్ 86 పరుగుల తేడాతో గెలిచింది. యువీ గతంలోనూ AUSను ఇలాగే చిత్తు చేశారు. 2000 CT క్వార్టర్ ఫైనల్, 2007WC సెమీస్, 2011WC క్వార్టర్ ఫైనల్స్లో POTM గెలిచారు.
Similar News
News January 13, 2026
గాదె ఇన్నయ్య.. మరోసారి NIA రైడ్స్

TG: జనగామ జిల్లాలోని జఫర్గఢ్లో గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’ ఆశ్రమంలో NIA మరోసారి రైడ్స్ చేస్తోంది. ఆయన స్వగ్రామం సాగరంలోని ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. మావోయిస్టు సానుభూతిపరుడనే ఆరోపణలతో గతంలో ఇన్నయ్యను NIA అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది.
News January 13, 2026
రూ.లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు

షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణత, ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండాలి. మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1.25 లక్షల జీతం ఉంటుంది. అర్హతగల వారు JAN 24-FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అధికారిక <
News January 13, 2026
ఇరాన్ టారిఫ్ బాంబ్.. భారత్పై ప్రభావమెంత?

ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై <<18842223>>25% టారిఫ్<<>> విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఇది భారత్కూ వర్తిస్తుంది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోలు వల్ల US మనపై 50% సుంకాలు బాదుతోంది. తాజాగా ఇరాన్ ఎఫెక్ట్ కూడా పడితే మొత్తంగా అగ్రరాజ్యానికి మనం చేసే ఎగుమతులపై 75% టారిఫ్లు కట్టాల్సి వస్తుంది. టెహ్రాన్లోని ఎంబసీ లెక్కల ప్రకారం.. భారత్-ఇరాన్ మధ్య $1.68B (దాదాపు రూ.15,150 కోట్లు) బైలేటరల్ ట్రేడ్ కొనసాగుతోంది.


