News July 13, 2024

అదే దూకుడు.. అదే బాదుడు!

image

భారత మాజీ క్రికెటర్ యువ‌రాజ్ సింగ్ రిటైరైనా కంగారూ జట్టుపై చితక్కొట్టడం మాత్రం మర్చిపోలేదు. లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో నిన్నటి సెమీఫైనల్‌లో యువీ 28బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేశారు. దీంతో భారత్ 86 పరుగుల తేడాతో గెలిచింది. యువీ గతంలోనూ AUSను ఇలాగే చిత్తు చేశారు. 2000 CT క్వార్టర్ ఫైనల్, 2007WC సెమీస్, 2011WC క్వార్టర్ ఫైనల్స్‌లో POTM గెలిచారు.

Similar News

News December 15, 2025

వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి?

image

ప్రకృతి, మానవ జీవన మనుగడలను సమన్వయం చేస్తూ మనల్ని రక్షించే శాస్త్రమే ‘వాస్తు’ అని, మన క్షేమం కోసం వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటున్నారు. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమే అంటున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబలో ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 15, 2025

జనవరిలో భారీ ఓపెనింగ్స్.. ప్రిపేర్ అవ్వండి!

image

డిసెంబర్ ‘డ్రై మంత్’ ముగియగానే జనవరిలో ఐటీ కంపెనీలు భారీ నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇయర్ ఎండ్ ఆడిట్‌లు, బడ్జెట్ ప్రణాళికలు పూర్తవడంతో డిసెంబర్‌లో ఇంటర్వ్యూలు ఆగిపోతాయి. జనవరి ఓపెనింగ్స్ కోసం HR టీమ్స్ ప్లాన్ చేసుకుంటాయి. రాబోయే నోటిఫికేషన్‌లు, లక్ష్యంగా చేసుకోవాల్సిన కంపెనీలపై ప్రణాళిక వేసుకొని సిద్ధంగా ఉండాలి’ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. SHARE IT

News December 15, 2025

‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

image

AP: రాష్ట్రావతరణ దినంపై కొందరు రాజకీయం చేస్తున్నారని CM CBN మండిపడ్డారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 OCT 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956 NOV 1న AP ఏర్పాటైంది. ఈ తేదీలపై కొందరు రాజకీయం చేస్తున్నారు. అందుకే శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. చెన్నైలోని ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని మెమోరియల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.