News July 13, 2024
అదే దూకుడు.. అదే బాదుడు!

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైరైనా కంగారూ జట్టుపై చితక్కొట్టడం మాత్రం మర్చిపోలేదు. లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్తో నిన్నటి సెమీఫైనల్లో యువీ 28బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేశారు. దీంతో భారత్ 86 పరుగుల తేడాతో గెలిచింది. యువీ గతంలోనూ AUSను ఇలాగే చిత్తు చేశారు. 2000 CT క్వార్టర్ ఫైనల్, 2007WC సెమీస్, 2011WC క్వార్టర్ ఫైనల్స్లో POTM గెలిచారు.
Similar News
News December 14, 2025
రాజమండ్రి: రికార్డులు లేని 68 బైక్లు సీజ్

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్తుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.
News December 14, 2025
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/
News December 14, 2025
నదీజలాలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం: BRS

TG: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న BRSLP, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరుగుతుందని BRS వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం జలాలను కొల్లగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించింది. దీనిపై ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొంది.


