News February 8, 2025

లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

TG: లా సెట్, ఈసెట్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్, మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష జరగనుంది.

Similar News

News December 14, 2025

వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.

News December 14, 2025

KCRకి ఉన్న చరిష్మా వాళ్లెవరికీ లేదు: టీపీసీసీ చీఫ్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘KCRకి ఉన్న చరిష్మా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేదు. పార్టీని నడపడం KTR వల్ల కాదు. BRSను హరీశ్ చీల్చుతాడు. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకొస్తుంది. KTR డబ్బులు పెట్టి సోషల్ మీడియాతో నడిపిస్తున్నాడు’ అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. CBN పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా ఇన్వెస్టర్లు HYD వైపే చూస్తున్నారని అన్నారు.

News December 14, 2025

15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

image

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్‌తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.