News October 22, 2024
స్కూల్ టీచర్ వేధించాడు.. ఎవరికీ చెప్పుకోలేకపోయా: సాక్షి మాలిక్

చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ తన బుక్ ‘విట్నెస్’లో వెల్లడించారు. ‘ట్యూషన్ టీచర్ వేధించేవాడు. కొన్నిసార్లు నన్ను తాకేందుకు ప్రయత్నించేవాడు. దీంతో క్లాస్లకు వెళ్లేందుకు భయపడేదాన్ని. ఇది నా తప్పుగా భావించి పేరెంట్స్కు చెప్పలేకపోయా’ అని పేర్కొన్నారు. రెజ్లింగ్లోకి అడుగుపెట్టాక కూడా ఎప్పుడు పారిపోవాలనే ఆలోచించేదాన్నని రాసుకొచ్చారు.
Similar News
News November 27, 2025
పాలకుర్తి: నువ్వా? నేనా? అన్నట్లుగా ఎన్నికలు!

పాలకుర్తి నియోజకవర్గంలో జరగబోయే స్థానిక ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని, అత్త ఝాన్సీ రెడ్డిలు సైతం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. ఎవ్వరు తగ్గేది లేదు అన్నట్టుగా ఉండటంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.
News November 27, 2025
ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్

అన్ని దేశాల్లో డెంగ్యూ కేసులు పెరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే తొలిసారి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. Butantan-DV అనే ఈ టీకాను 12-59 ఏళ్ల ప్రజలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం డెంగ్యూకు TAK-003 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. WHO నిబంధనల ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండుసార్లు వేసుకోవాలి.
News November 27, 2025
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్లో అడుగుపెట్టి తన పంచ్ పవర్తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్లో మరో మైలురాయిగా నిలిచింది.


