News April 14, 2025
నేను చేసిన స్కోరుకు విలువే లేదు: కరుణ్ నాయర్

IPL: ఢిల్లీ ప్లేయర్ కరుణ్ నాయర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో తాను చేసిన స్కోరుకు విలువే లేదన్నారు. తనకు జట్టు విజయమే ముఖ్యమని.. ఓడిపోయిన మ్యాచ్లో ఎంత స్కోర్ చేసినా లాభం లేదన్నారు. ముంబైపై కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89(12 ఫోర్లు, 5 సిక్సర్లు) స్కోర్ చేశారు. తన పవర్ హిట్టింగ్తో బుమ్రాను సైతం వణికించారు. కరుణ్ నాయర్, పోరెల్(33) మినహా ఢిల్లీ జట్టులో బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.
Similar News
News April 15, 2025
రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ పేర్లను చేర్చినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ వీటిలో పాల్గొనాలని పేర్కొంది.
News April 15, 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <
News April 15, 2025
పంజాబ్కు ‘మ్యాక్సీ’మమ్ నిరాశే

పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్వెల్ మరోసారి నిరాశపరిచారు. KKRతో మ్యాచులో కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ను ముందుండి నడిపించాల్సింది పోయి వరుణ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యారు. గత మ్యాచుల్లోనూ మ్యాక్సీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మొత్తంగా ఈ సీజన్లో 6 మ్యాచుల్లో 41 పరుగులే చేశారు. దీంతో జట్టుకు భారంగా మారారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.