News November 2, 2024
ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్

న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. కివీస్ను రెండో ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఇవాళ ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 171/9 రన్స్ చేసింది. ఓవరాల్గా 143 పరుగుల లీడ్లో ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం ధాటికి కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. విల్ యంగ్ (51) ఒక్కరే అర్ధ సెంచరీ సాధించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
Similar News
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.
News November 15, 2025
నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

* 1935: నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో)
* ఝార్ఖండ్ ఫౌండేషన్ డే
News November 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


