News April 7, 2024
2014కు ముందు ఉన్న పరిస్థితే వస్తుంది: జగదీశ్ రెడ్డి

TG: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుదారులను పక్కనే పెట్టుకుని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి నిర్మించిన వాటిని వంద రోజుల్లోనే నాశనం చేశారని అన్నారు. కొత్తగా మారుస్తారనుకుంటే.. 2014కు ముందు ఉన్న ఆత్మహత్యలు, ఆకలి చావుల పరిస్థితులే వస్తాయన్నారు.
Similar News
News October 31, 2025
మహిళల ప్రపంచకప్: భారత్ గెలిచేసిందట!

మహిళల ODI వరల్డ్కప్ను టీమ్ ఇండియా గెలిచేసిందంటూ ‘వికీపీడియా’ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ‘50 ఓవర్లలో ఇండియా 326-5 రన్స్ చేసింది. సౌతాఫ్రికా 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది’ అని సైట్లో కనిపించింది. వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేయగలిగే ఓపెన్ ఎడిటింగ్ పాలసీ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. తర్వాత సరిదిద్దినట్లు సమాచారం. నవంబర్ 2న సౌతాఫ్రికా, భారత్ మధ్య నవీ ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
News October 31, 2025
తెలంగాణలో IASల బదిలీ

*అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్
*గురుకుల సంక్షేమ కమిషనర్గా అనితా రామచంద్రన్కు పూర్తి అదనపు బాధ్యతలు
*రవాణా శాఖ కమిషనర్గా ఇలంబర్తి
*జీఏడీ పొలిటికల్ ఇన్ఛార్జ్ సెక్రటరీగా E.శ్రీధర్
*ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషా
*మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ సెక్రటరీగా సీఎస్ రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు
News October 31, 2025
కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.


