News July 10, 2024

సాంగ్‌ను సిరివెన్నెల సిగరెట్ పెట్టెపై రాశారు: కృష్ణవంశీ

image

సింధూరంలో ‘అర్థశతాబ్దపు’ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఓ సిగరెట్ పెట్టెపై రాశారట. ఆ మూవీ దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ‘మూవీ ఫస్ట్ కాపీ చూశాక అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏంటి గురువుగారూ అని అడిగితే పేపర్ ఇమ్మన్నారు. చేతిలో ఏం లేక రోడ్డుపై సిగరెట్ పెట్టెను తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసి గంటలో పాట ఇచ్చారు. ఆయన చెప్పడం వల్లే ఈ పాట సినిమాలో పెట్టాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

image

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్‌, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.

News November 28, 2025

గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

image

గ్రీన్‌కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.

News November 28, 2025

కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

image

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.