News November 14, 2024

అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లను నామినేట్ చేసిన స్పీకర్

image

AP: అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా పలువురు MLAలకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అవకాశం కల్పించారు. వైసీపీ MLA దాసరి సుధ, జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు అవకాశం ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Similar News

News October 23, 2025

తేలని ‘స్థానిక’ అంశం!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News October 23, 2025

HYDలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్

image

TG: USకు చెందిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. HYDను ఎంచుకోవడాన్ని CM స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్రాన్ని 2047నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ఆయన వారికి వివరించారు.

News October 23, 2025

బంగ్లాదేశ్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ

image

AP: విజయనగరం(D)కి చెందిన 8మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళానికి పట్టుబడడం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి విడుదలపై ఏపీ ప్రభుత్వం బంగ్లాదేశ్ GOVTకి లేఖ రాసింది. వారిని క్షేమంగా వెనక్కు రప్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళన వద్దని ఆ కుటుంబాలకు సూచించారు.