News September 2, 2025
కవితపై వేటుకు రంగం సిద్ధం!

TG: ఎమ్మెల్సీ కవితపై వేటు వేసేందుకు BRS పార్టీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా నోట్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాసేపట్లో BRS నేతలు మీడియా ముందుకు రానున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత నిన్న సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 21, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News September 21, 2025
రేపు విశాఖకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. మరోవైపు రేపు మ.3గంటలకు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల ప్రదానం జరగనుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి.
News September 21, 2025
రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి

TG: రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని Dy.CM భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మహిళలంతా ఆర్థికంగా, శక్తిమంతులుగా ఎదగాలి’ అని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మపై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.