News February 24, 2025
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: గవర్నర్

AP: ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాలతో మేలు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. మెగా DSC దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం’ అని గవర్నర్ చెప్పారు.
Similar News
News February 24, 2025
SVSCలో పెద్దోడు, చిన్నోడు పేర్లివే!

టాలీవుడ్ బెస్ట్ క్లాసిక్లలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్, మహేశ్బాబుల క్యారెక్టర్ల పేర్లు రివీల్ అయినట్లు తెలుస్తోంది. పెద్దోడు, చిన్నోడు క్యారెక్టర్లకు పెట్టిన పేర్లివే. పెద్దోడు సిరి మల్లికార్జునరావు, చిన్నోడు సీతారామ రాజు అని IMDలో పేర్కొన్నారు. దీనిని ఇరు హీరోల ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
News February 24, 2025
YCPకి ప్రతిపక్ష హోదా రాదు: Dy.CM పవన్

AP: ‘ఈ ఐదేళ్లలో YCPకి ప్రతిపక్ష హోదా రాదు.. ఇది గుర్తుపెట్టుకోవాలి’ అని Dy.CM పవన్ తేల్చిచెప్పారు. 11 సీట్లు ఉన్న YCPకి ఆ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదని చెప్పారు.
News February 24, 2025
28న రాష్ట్ర బడ్జెట్

AP: ఈ నెల 28న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 19లోపు బడ్జెట్ ప్రక్రియ ముగుస్తుందని బీఏసీ మీటింగ్లో నేతలు అంచనా వేశారు. అవసరమైతే మరో రెండు రోజులు (మార్చి 20, 21) పొడిగించుకునేలా షెడ్యూల్ రూపొందించారు.