News February 24, 2025
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: గవర్నర్

AP: ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాలతో మేలు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. మెగా DSC దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం’ అని గవర్నర్ చెప్పారు.
Similar News
News November 18, 2025
X(ట్విటర్) డౌన్కు కారణమిదే!

ప్రముఖ SM ప్లాట్ఫామ్ ‘X’ సేవలు <<18322641>>నిలిచిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. దాని హోస్ట్ సర్వర్ ‘క్లౌడ్ఫ్లేర్’లో గ్లిచ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. X మాత్రమే కాకుండా క్లౌడ్ఫ్లేర్పై ఆధారపడిన కాన్వా, పర్ప్లెక్సిటీ వంటి సేవలు నిలిచిపోయాయి. ‘సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని క్లౌడ్ఫ్లేర్ సంస్థ వెల్లడించింది.
News November 18, 2025
సెరామిక్ పాత్రలతో ప్రయోజనం..

ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్డే కాదు వాడే పాత్రలూ ముఖ్యమే. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వల్ల అనారోగ్యం వస్తుందంటున్నారు నిపుణులు. వీటిబదులు సెరామిక్ వాడటం మంచిది. దీంట్లో రసాయనాల కోటింగులు ఉండవు. పుల్లటి పదార్థాలు వండినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. సిలికాన్తో రూపొందిన సెరామిక్ జెల్ నాన్స్టిక్గా పనిచేస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.
News November 18, 2025
మద్యం తాగుతున్నారా.. డాక్టర్ ఏమన్నారంటే?

అతిగా మద్యం సేవిస్తే చిన్న వయసులోనే తీవ్రమైన మెదడు రక్తస్రావం వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనంలో వెల్లడైనట్లు ప్రముఖ వైద్యుడు సుధీర్ హెచ్చరించారు. భారీగా మద్యం సేవించేవారిలో ప్లేట్లెట్స్ పనిచేయక రక్తం గడ్డకట్టే సామర్థ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. ఫలితంగా పెద్ద రక్తస్రావాలు సంభవిస్తాయని తెలిపారు. మద్యం తాగితే ఏకాగ్రత, నిర్ణయాధికారం దెబ్బతింటాయని, అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు.


