News July 9, 2024
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. డబ్బుల్లేవు: సీఎం చంద్రబాబు

AP: ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక ఇస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. దీనివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, YCPలోని కొందరికి కడుపు నొప్పి వచ్చిందని ఎద్దేవా చేశారు. ‘వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఖజానాలో డబ్బుల్లేవు. నిధుల కోసం ఢిల్లీ వెళ్లి అందరినీ రిక్వెస్ట్ చేసి వచ్చా. ఒక పక్క రోజువారీ అప్పులున్నాయి. అప్పులు ఇచ్చినవాళ్లు రోజూ తిరుగుతున్నారు’ అని తెలిపారు.
Similar News
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.
News November 26, 2025
పలాశ్ను అన్ఫాలో చేసిన స్మృతి.. నిజమిదే!

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్స్టాలో అతడిని ఆమె అన్ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.


