News September 24, 2025
శివపార్వతుల కథ: కాశీ అన్నపూర్ణావతారం

ఓసారి శివుడు అన్నంతో సహా అన్నీ మాయేనని అంటాడు. ఈ మాటలు నచ్చక పార్వతీ దేవి కాశీని విడిచి వెళ్లగా ప్రపంచంలో ఆహారం దొరకక ప్రజలు ఆకలితో అలమటిస్తారు. ప్రజల కష్టాలు చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలి తీరుస్తారు. అప్పుడు ఆహారం ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు భిక్షాపాత్ర పట్టుకుని పార్వతి వద్దకు వెళ్లి భిక్ష అడుగుతాడు. అప్పటి నుంచి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో కొలువై భక్తుల ఆకలిని తీరుస్తోంది.
Similar News
News September 24, 2025
రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల సందడి షురూ!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. వార్డు సభ్యుడి నుంచి ZP స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. ఆయా నివేదికలను ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లను త్వరలో డ్రా పద్ధతిలో నిర్ణయించనున్నారు.
News September 24, 2025
98 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ 98 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు OCT 10వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News September 24, 2025
‘OG’ కోసం ఒక్కరోజు థియేటర్లు ఇచ్చిన ‘మిరాయ్’ మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా రేపు విడుదల కానుంది. కొన్ని చోట్ల ఇవాళ రాత్రి స్పెషల్ షోలున్నాయి. ఈక్రమంలో ‘మిరాయ్’ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ‘మిరాయ్’ ప్రదర్శించే చాలా థియేటర్లను ‘OG’కి ఇస్తున్నట్లు తెలియజేశారు. పవన్పై ఉన్న అభిమానంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. ఇక 26వ తేదీన మళ్లీ ఆ థియేటర్లలో ‘మిరాయ్’ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.140+కోట్ల కలెక్షన్లు రాబట్టింది.