News September 26, 2024

అన్న క్యాంటీన్ల రాయితీ ఖర్చు రూ.166 కోట్లు

image

AP: అన్నక్యాంటీన్లలో పేదలకు అందిస్తున్న భోజనానికి సంబంధించి సబ్సిడీ కింద ఏటా రూ.166.25 కోట్లను కేటాయిస్తూ GOVT పరిపాలన అనుమతులిచ్చింది. బ్రేక్ ‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి ఒక్కొక్కరిపై రూ.75 చొప్పున రాయితీ భరించనుంది. కాగా అన్న క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్న సంగతి తెలిసిందే. అక్షయపాత్ర సంస్థ వీటి నిర్వహణను చూస్తోంది. 3 పూటల భోజనానికి రూ.90 ఖర్చు అవుతుండగా రూ.15 ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

image

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్‌లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.

News November 27, 2025

నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

image

1888: లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం

News November 27, 2025

టీమ్‌‍ఇండియా ఓటమిపై గిల్ రియాక్షన్

image

SAతో హోమ్ టెస్ట్ సిరీస్‌లో టీమ్‌ఇండియా వైట్‌వాష్ కావడంతో వస్తున్న విమర్శలపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదటిసారి స్పందించారు. “ప్రశాంత సముద్రాలు ఎలా ముందుకు సాగాలో నేర్పించవు.. తుఫాన్లే బలమైన చేతులను తయారు చేస్తాయి. మేమంతా ఒకరినొకరం నమ్ముకుని ముందుకు సాగుతాం” అని SMలో పోస్ట్ చేశారు. గాయం కారణంగా గిల్‌ రెండో టెస్ట్‌‌తో పాటు SAతో ODI సిరీస్‌కు సైతం దూరమైన విషయం తెలిసిందే.