News September 26, 2024
అన్న క్యాంటీన్ల రాయితీ ఖర్చు రూ.166 కోట్లు

AP: అన్నక్యాంటీన్లలో పేదలకు అందిస్తున్న భోజనానికి సంబంధించి సబ్సిడీ కింద ఏటా రూ.166.25 కోట్లను కేటాయిస్తూ GOVT పరిపాలన అనుమతులిచ్చింది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఒక్కొక్కరిపై రూ.75 చొప్పున రాయితీ భరించనుంది. కాగా అన్న క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్న సంగతి తెలిసిందే. అక్షయపాత్ర సంస్థ వీటి నిర్వహణను చూస్తోంది. 3 పూటల భోజనానికి రూ.90 ఖర్చు అవుతుండగా రూ.15 ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
ఎన్నికలపై విచారణ వాయిదా

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.
News November 24, 2025
హనుమాన్ చాలీసా భావం – 19

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 24, 2025
INDSETIలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ <


