News June 4, 2024
తండ్రీకుమారుల వెనుకంజ

AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గెలిచిన భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులు రెడ్డి 13,979 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు చంద్రగిరి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి పులివర్తి నాని కంటే 10,579 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
Similar News
News November 21, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. OCT 11న సీజ్ఫైర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి Israel దాడుల్లో కనీసం 211 మంది చనిపోయారని, 597 మంది గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల ఎలాంటి మార్పూ రాలేదని, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పాలస్తీనియన్లు ఆవేదన చెందుతున్నారు.
News November 21, 2025
APPLY NOW: CLRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI)14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 22లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech, M.Tech, ఎంఫార్మసీ, MVSc, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. DEC 22న రాత పరీక్ష, 23న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: https://www.clri.org/
News November 21, 2025
Rh నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏం చేయాలంటే?

తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ అయితే ప్రెగ్నెన్సీలో కచ్చితంగా ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ICT) 3,7 నెలల్లో చేయించుకోవాలి. ఐసీటీ నెగెటివ్ వస్తే ఏడో నెలలో, డెలివరీ అయిన 72 గంటల్లో తల్లికి ‘యాంటీ డీ’ ఇంజెక్షన్ డోసులు ఇస్తారు. రెండోసారి గర్భం దాల్చిన వారిలోనే దీని సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించాలి. సమస్య తీవ్రతను బట్టి బిడ్డకు చికిత్స చేస్తారు.


