News July 12, 2024
‘హాథ్రస్’పై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇటువంటి కేసులను హైకోర్టుల్లో పరిష్కరించడం మంచిదని, పిటిషనర్ అలహాబాద్ (యూపీ) కోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.
Similar News
News October 30, 2025
AP న్యూస్ అప్డేట్స్

✦ నవంబర్ 1న లండన్కు CM చంద్రబాబు.. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే CII సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న CM
✦ ఏటా NOV 10న రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి
✦ YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు జగన్ వీడియో కాన్ఫరెన్స్.. మొంథా తుఫాన్ ప్రభావంపై చర్చ
✦ రాజధాని రైతులకు రాబోయే 4 నెలల్లో పెండింగ్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తి: మంత్రి నారాయణ
News October 30, 2025
ఆలస్యంగా ఎందుకు నిద్ర లేవకూడదు?

మన పూర్వీకులు ప్రకృతిని దైవంగా భావించేవారు. వ్యవసాయం, చేతిపనులతో భూమితో బంధాన్ని కలిగి ఉండేవారు. ఆ జీవన విధానం వారికి ప్రశాంతతను ఇచ్చేది. కానీ నేడు ఉద్యోగాల వల్ల ఆ పద్ధతి దూరమవుతోంది. ఆధునిక జీవనంలో ఇంట్లో ఖాళీ సమయం పెరిగి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక బద్ధకస్తులమవుతున్నారు. శారీరక శ్రమ, ప్రకృతితో అనుబంధం లేకపోవడం వల్ల ఈ నిగ్రహాన్ని కోల్పోతున్నాం. అందుకే మంచిది కాని ఈ అలవాటును వదలాలి. <<-se>>#JEEVANAM<<>>
News October 30, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?


