News April 28, 2024

రేపు కేజ్రీవాల్ పిటిషన్ విచారించనున్న సుప్రీం

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు రేపు విచారించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌ దత్తల ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది.

Similar News

News December 8, 2025

‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

image

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

News December 8, 2025

రూర్బన్ పంచాయతీలుగా 359 గ్రామాలు

image

AP: 10వేల జనాభా, కోటికి పైగా ఆదాయమున్న359 గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా ప్రభుత్వం మార్చనుంది. CM CBN సూచనలతో వీటిని ఏర్పాటు చేస్తోంది. పట్టణ తరహా సదుపాయాలను వీటిలో కల్పించనుంది. నిబద్ధత కలిగిన Dy MPDOలను వీటికి కార్యదర్శులుగా నియమిస్తారు. ప్రతి 4 జిల్లాలకు కలిపి ZP CEO స్థాయిలో పర్యవేక్షణాధికారిని ఏర్పాటు చేస్తారు. MNPల మాదిరి వివిధ కార్యక్రమాలకోసం నాలుగు విభాగాల సిబ్బందిని కూడా నియమించనున్నారు.

News December 8, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.