News January 29, 2025
సర్వే దేశం దృష్టిని ఆకర్షించింది: CM రేవంత్

తెలంగాణలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశం దృష్టిని ఆకర్షించిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన పూర్తవ్వడంపై బుధవారం ఆయన మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని, దీనికి కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని, పూర్తి నివేదికను Feb 2లోగా క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 5, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News December 5, 2025
Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 334 రన్స్కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.
News December 5, 2025
మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.


