News April 24, 2024
దేశంలో ఎత్తైన హనుమాన్ విగ్రహమిదే!

దేశంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఏపీలో ఉంది. శ్రీకాకుళం జిల్లా మడపంలో 176 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చు చేశారు. బిదనగెరె (కర్ణాటక) 161 అడుగులు, పరిటాల (ఏపీ) 135, ఒడిశాలోని దమంజోడి హనుమాన్ 108.9, సిమ్లాలోని జాఖూ హిల్ హనుమాన్ 108, ఢిల్లీలోని శ్రీ సంకట్ మోచన్ హునుమాన్ 108 అడుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News November 9, 2025
డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
News November 9, 2025
బాడీ షేమింగ్.. హీరోయిన్కు క్షమాపణలు

బాడీ షేమింగ్కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.
News November 9, 2025
తెలంగాణ రైతులకు బిహార్ ఎన్నికల దెబ్బ!

బిహార్ ఎన్నికలు రైతులకు సమస్యను తెచ్చి పెట్టాయి. ఓటేసేందుకు బిహారీలు సొంత రాష్ట్రానికి వెళ్తుండటంతో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్లోడింగ్ కావడం లేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో 20వేల మంది హమాలీలు ఉంటే 18వేల మంది బిహారీలే. ఓటేసేందుకు రాజకీయ పార్టీలు వారికి రూ.5వేల చొప్పున ఇచ్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న అక్కడ ఎన్నికలు ముగుస్తాయి.


