News April 6, 2024
ఏటా కనీసం $100 బిలియన్లు రాబట్టడమే టార్గెట్!

FDI కింద ఏటా $100 బిలియన్లకుపైగా పెట్టుబడులను రాబట్టాలని భారత్ ఆశిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మరో ఐదేళ్లలో ఈ టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాయి. కాగా FY22లో గరిష్ఠంగా $80 బిలియన్లకుపైగా చేరిన FDI సగటు ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. చైనాకు దీటుగా ప్రత్యామ్నాయంగా మార్చుకుని, ఆ దేశానికి తరలివెళ్లే పెట్టుబడులను ఇటువైపుకు తిప్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 13, 2026
భవిష్యత్లో 80కోట్ల మందికి నో జాబ్స్: వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్

రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సంక్షోభం తలెత్తవచ్చని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా హెచ్చరించారు. ‘యుద్ధం లాంటి సమస్యలు ముగిసినా అసలైన సవాలు నిరుద్యోగమే. వచ్చే 10-15yrsలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 120Cr మంది పనిచేసే వయసుకు వస్తారు. కేవలం 40Cr ఉద్యోగాలు సృష్టించబడతాయి. 80Cr మందికి జాబ్స్ దొరక్కపోవచ్చు. దేశాలు వ్యవసాయం, తయారీ, పర్యాటక రంగాలపై దృష్టిపెట్టాలి’ అని సూచించారు.
News April 13, 2026
హార్దిక్ కెప్టెన్సీపై అశ్విన్ విమర్శలు

IPL:నిన్న ఆర్సీబీతో మ్యాచులో హార్దిక్ పాండ్య కెప్టెన్గా ఫెయిల్ అయ్యారని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. స్పిన్నర్లపై విరుచుకుపడే రజత్ పాటీదార్ క్రీజులోకి రాగానే మయాంక్ మార్కండేకు బౌలింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మార్కండే రెండు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చాడని.. ఇదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని అభిప్రాయపడ్డారు. పాండ్య తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని అసంతృప్తి వ్యక్తం చేశారు.
News April 13, 2026
నెలసరి ఆలస్యం అవుతోందా?

నెలసరి తరచూ ముందుగా లేదా ఆలస్యం అవడానికి జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలూ కారణం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చిన్న విషయాలకే ఆందోళన చెందడం, డైటింగ్ పేరుతో ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. మితిమీరిన వ్యాయామం, దీర్ఘకాల నిద్రలేమి, మెడిసిన్స్ ప్రభావం కూడా నెలసరిపై పడుతుంది. దీనిపై డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


