News April 6, 2024
ఏటా కనీసం $100 బిలియన్లు రాబట్టడమే టార్గెట్!
FDI కింద ఏటా $100 బిలియన్లకుపైగా పెట్టుబడులను రాబట్టాలని భారత్ ఆశిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మరో ఐదేళ్లలో ఈ టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాయి. కాగా FY22లో గరిష్ఠంగా $80 బిలియన్లకుపైగా చేరిన FDI సగటు ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. చైనాకు దీటుగా ప్రత్యామ్నాయంగా మార్చుకుని, ఆ దేశానికి తరలివెళ్లే పెట్టుబడులను ఇటువైపుకు తిప్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 9, 2024
ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా
వివాదంలో చిక్కుకున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అండగా నిలిచారు. తాను చిన్న దూరాలు ప్రయాణించేందుకు ఓలా స్కూటర్నే వినియోగిస్తానంటూ ట్వీట్ చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు, ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్కు మధ్య నెట్టింట వాగ్వాదం అనంతరం కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(CCPA) ఓలా ఎలక్ట్రిక్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు సంస్థ షేర్లు సైతం 9శాతం పడిపోయాయి.
News October 9, 2024
ఆస్ట్రేలియా సిరీస్ ప్రదర్శనలో అతడే టాప్లో ఉంటాడు: లారా
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తారని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశారు. ‘ఈసారి BGTలో అందరికంటే యశస్వీ బాగా ఆడతారు. కరీబియన్ దీవుల్లో ఆడినప్పుడు తన ఆటతీరు చూశాను. ఏ పరిస్థితుల్లోనైనా మంచి క్రికెట్ ఆడగల ప్లేయర్. టీమ్ ఇండియానే సిరీస్ గెలుచుకుంటుంది’ అని లారా జోస్యం చెప్పారు.
News October 9, 2024
అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు
1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని ఎస్పీ శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ పుట్టినరోజు
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం