News February 9, 2025
తెలంగాణ ప్రీమియర్ లీగ్ మళ్లీ వచ్చేస్తోంది!

యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రీమియర్ లీగ్ టోర్నీని ఈ ఏడాది నుంచి తిరిగి ప్రారంభిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు వెల్లడించారు. తిలక్ వర్మ ఈ టోర్నీ ద్వారానే వెలుగులోకి వచ్చాడని తెలిపారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో 10 ఎకరాల్లో కొత్త స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు.
Similar News
News November 19, 2025
రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
News November 19, 2025
హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.
News November 19, 2025
ఇండియా-ఎ ఓటమి

సౌతాఫ్రికా-ఎతో జరిగిన 3వ అనధికారిక వన్డేలో భారత్-ఎ 73 రన్స్ తేడాతో ఓడిపోయింది. SA నిర్దేశించిన 326 రన్స్ టార్గెట్ను ఛేదించలేక 252 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఆయుష్ బదోని(66), ఇషాన్ కిషన్(53) మినహా ఎవరూ రాణించలేదు. రుతురాజ్ 25, అభిషేక్ 11, తిలక్ వర్మ 11, పరాగ్ 17 రన్స్కే ఔటై నిరాశపరిచారు. అంతకుమందు SA ఓపెనర్లు ప్రిటోరియస్(123), మూన్సమీ(107) సెంచరీలతో చెలరేగారు.


