News May 1, 2024
21 జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఏపీవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా పల్నాడు(D) కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి(D) మంగనెల్లూరులో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 21 జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. రేపు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా ప్రాంతాల వివరాల కోసం ఈ <
Similar News
News January 31, 2026
కశ్మీర్లో ఉగ్రవాదులతో భీకర పోరు

JKలోని కిష్తవార్ జిల్లా దోల్గాంలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ మొదలైంది. జనవరి 18న మొదలైన ఆపరేషన్ త్రాషి-Iలో భాగంగా భారత ఆర్మీ, JK పోలీసులు, CRPF సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడే నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులు బలగాలకు తారసపడ్డారు. వారు కాల్పులు జరపటంతో.. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
News January 31, 2026
నేటితో ముగియనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం నేటితో ముగియనుంది. 13,257 గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికీ పశువులకు టీకాలు వేయించకుంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.
News January 31, 2026
ధనవంతులు కావాలంటే..?

ధనవంతులు కావాలనే తపన అందరిలో ఉంటుంది. కానీ అందుకు అదృష్టం కూడా తోడవాలి. ఆధ్యాత్మికంగా ధనాకర్షణ పెరగాలంటే తోటివారికి సాయం చేయడం, దానం చేయడం ఉత్తమం. పర్సులో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవడం, దగ్గర డబ్బులు పెట్టడం వల్ల సంపద శక్తి పెరుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సానుకూలత లభిస్తుంది. అయితే, ఈ మార్గాలన్నీ ఇంజిన్కు పెట్రోల్ వంటివి మాత్రమే. లక్ష్యాన్ని చేరడానికి మీ నిరంతర కృషే అసలైన వాహనం.


