News August 7, 2024
‘నాట్ ఔట్’కి బదులు ‘ఔట్’ ఇచ్చిన థర్డ్ అంపైర్

ఇండియా VS శ్రీలంక మూడో వన్డేలో ఆసక్తికర విషయం జరిగింది. 49వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి మహీశ్ తీక్షణ ముందుకెళ్లి షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా మిస్ అయింది. దీంతో WK రిషభ్ స్టంపింగ్ చేయగా అప్పటికే తీక్షణ బ్యాట్ను గ్రీస్లోపల ఉంచారు. కానీ, థర్డ్ అంపైర్ ‘ఔట్’ అని ప్రకటించడంతో శ్రీలంక కోచ్తో సహా అంతా షాక్ అవగా వెంటనే ‘నాట్ ఔట్’ అని మార్చారు. అయితే తీక్షణ బౌలింగ్లో పంత్ స్టంప్ ఔట్ అయ్యారు.
Similar News
News December 10, 2025
క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.
News December 10, 2025
ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.
News December 10, 2025
అఖండ-2 టికెట్ రేట్లు భారీగా పెంపు

అఖండ-2 సినిమా టికెట్ల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రా.8 గంటల ప్రీమియర్ షో టికెట్ రేట్ను రూ.600గా నిర్ధారించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ రేట్ పెంచుకోవచ్చని పేర్కొంది. కాగా అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం <<18519580>>ఇప్పటికే<<>> అనుమతి ఇచ్చింది.


