News August 7, 2024
‘నాట్ ఔట్’కి బదులు ‘ఔట్’ ఇచ్చిన థర్డ్ అంపైర్

ఇండియా VS శ్రీలంక మూడో వన్డేలో ఆసక్తికర విషయం జరిగింది. 49వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి మహీశ్ తీక్షణ ముందుకెళ్లి షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా మిస్ అయింది. దీంతో WK రిషభ్ స్టంపింగ్ చేయగా అప్పటికే తీక్షణ బ్యాట్ను గ్రీస్లోపల ఉంచారు. కానీ, థర్డ్ అంపైర్ ‘ఔట్’ అని ప్రకటించడంతో శ్రీలంక కోచ్తో సహా అంతా షాక్ అవగా వెంటనే ‘నాట్ ఔట్’ అని మార్చారు. అయితే తీక్షణ బౌలింగ్లో పంత్ స్టంప్ ఔట్ అయ్యారు.
Similar News
News December 15, 2025
సర్పంచ్ రిజల్ట్స్.. ‘టాస్’తో గెలిచారు

TG: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చాయి. నల్గొండలోని మంగాపురంలో ఉపేంద్రమ్మకు, మౌనికకు సమానంగా ఓట్లు రాగా టాస్ వేయడంతో ఉపేంద్రమ్మకు పదవి వరించింది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో సంతోశ్, మానయ్యకు 483 ఓట్ల చొప్పున పోల్ అవ్వగా టాస్ వేసిన అధికారులు సంతోశ్ను విజేతగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో అధికారులు డ్రా తీసి విజేతలను నిర్ణయించారు.
News December 15, 2025
నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.
News December 15, 2025
రెండో విడతలోనూ కాంగ్రెస్దే హవా

TG: రెండో విడత GP ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.


