News February 5, 2025

మేం ముగ్గురం మిత్రులమే: గిల్

image

ఇండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా అభినందించాలని భారత క్రికెటర్ శుభ్‌‌మన్ గిల్ అన్నారు. అభిషేక్ తన బాల్య మిత్రుడని, జైస్వాల్ సైతం మంచి స్నేహితుడని తెలిపారు. మా ముగ్గురి మధ్య ఎటువంటి పోటీతత్వం ఉండదని అన్నారు. ఇండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడేలా ప్రయత్నించాలన్నారు. అంతేగాని ఒకరు బాగా ఆడకూడదని కోరుకోవటం సరికాదని శుభమన్ పేర్కొన్నారు.

Similar News

News February 5, 2025

T20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలనం

image

T20 క్రికెట్‌(ఇంటర్నేషనల్+లీగ్స్)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్(AFG) చరిత్ర సృష్టించారు. 460 మ్యాచ్‌లలో 632 వికెట్లు పడగొట్టి బ్రావో(631 వికెట్లు)ను వెనక్కినెట్టారు. SA20లో MI కేప్‌టౌన్‌ తరఫున ఆడుతున్న అతను పార్ల్ రాయల్స్‌పై 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. 26 ఏళ్లకే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. త్వరలోనే వెయ్యి వికెట్లకు చేరుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News February 5, 2025

ఆరోజు బుమ్రా ఉండి ఉంటే.: గిల్

image

BGT ఆఖరి టెస్టులో బుమ్రా గాయపడటం టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చిందని బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. ఆరోజు బుమ్రా ఫిట్‌గా ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ‘బుమ్రా గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరం. ఆయన ఉండి ఉంటే ఆ మ్యాచ్ కచ్చితంగా గెలిచేవాళ్లం. ఫలితంగా సిరీస్ 2-2తో సమమై మాపై విమర్శలు తప్పేవి. ఏదేమైనా.. మాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మేం ఆడలేకపోయామన్నది వాస్తవం’ అని స్పష్టం చేశారు.

News February 5, 2025

సా.6.30కు ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. వేగంగా WAY2NEWSలో..

image

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉ.7 నుంచి సా.6 వరకు కొనసాగనుంది. సా.6.30 తర్వాత ఆక్సిస్ మై ఇండియా, సీఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, IPSOS తదితర ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. ఆ వివరాలను వేగంగా, సమగ్రంగా, విశ్లేషణలతో WAY2NEWSలో తెలుసుకోవచ్చు.

error: Content is protected !!