News September 20, 2025
సమయం వచ్చింది.. దేశాభివృద్ధికి ప్రతిభను వాడుదాం!

ట్రంప్ నిర్ణయాల వేళ మన ప్రతిభతో ఇండియాను అభివృద్ధి చేసుకోవాలనే చర్చ మొదలైంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతక్కుండా మన దగ్గరే ప్రతిభను ఉపయోగించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్లు, టెక్నాలజీ, వ్యవసాయం వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రతి సవాలును అవకాశంగా మలుచుకొని దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే సత్తా మన యువతకు ఉందంటున్నారు.
Similar News
News September 20, 2025
ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్లతో పోల్చితే 17 మోడల్స్లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.
News September 20, 2025
ఎయిర్పోర్టులపై సైబర్ అటాక్.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్

యూరప్లోని పలు ఎయిర్పోర్టులపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. <<17769573>>రేపటిలోగా<<>> US వెళ్లాల్సిన H1B వీసాదారుల్లో ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మనదేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
News September 20, 2025
రేవంత్కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్చందర్

TG: CM రేవంత్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్రెడ్డిని నిందించడం రేవంత్ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.