News September 21, 2024
విదేశీ చదువుల ట్రెండ్ మారుతోంది
విదేశీ విద్య కోసం US, కెనడా, ఆస్ట్రేలియాను ఎంపిక చేసుకొనే ధోరణికి ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు స్వస్తిపలుకుతున్నారు. ఈ దేశాల కంటే తక్కువ జీవన వ్యయాన్ని, ట్యూషన్ ఫీజులను ఆఫర్ చేస్తున్న యూరోపియన్ దేశాలపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పైగా లిబరల్ లైఫ్స్టైల్ను కాంక్షిస్తూ దక్షిణాసియా విద్యార్థులు ఎక్కువగా యూరప్లో చదివేందుకు, స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Similar News
News September 21, 2024
గవర్నర్ను కలిసిన వైఎస్ షర్మిల
AP: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్ను కోరారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరో తేల్చాలని కోరారు.
News September 21, 2024
ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!
పుణేలో ఓ CA ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఘటన మరువక ముందే చెన్నైలో కార్తికేయన్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనీ ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, డిప్రెషన్కు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కుటుంబీకులెవరూ ఇంట్లోలేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News September 21, 2024
కేటీఆర్పై పరువు నష్టం దావా వేస్తాం: మంత్రి పొంగులేటి
TG: అమృత్ టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ <<14158364>>వ్యాఖ్యలపై<<>> పరువు నష్టం దావా వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. తెల్లారితే పోలింగ్ ఉండగా గత ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పీఎల్ఆర్, మేఘా, గజా కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టిందన్నారు.