News August 25, 2025

‘వినాయక చవితి’ ట్రెండ్ మారింది

image

గణేశ్ నిమజ్జనం రోజు చూసే వేడుకలు ఇప్పుడు వినాయకుడి ఆగమనం రోజున కనిపిస్తున్నాయి. విగ్రహాలను కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొస్తున్న సమయంలోనూ యువత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజే మ్యూజిక్, ఫైర్ వర్క్స్, రంగులు చల్లుకుంటూ బొజ్జ గణపయ్యకు ఆహ్వానం పలుకుతున్నారు. నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ గ్రామాలకు విస్తరిస్తోంది. ఏమైనప్పటికీ విద్యుత్ వైర్ల కింద నుంచి, రహదారులపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

Similar News

News August 25, 2025

ALERT: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవాలని TTD వెల్లడించింది. అలాగే, మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.

News August 25, 2025

ఒకే జిల్లా పరిధిలోకి అసెంబ్లీ సెగ్మెంట్స్!

image

TG: జనాభా లెక్కల అనంతరం కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలకు తగ్గట్టు సరిహద్దులు మారనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 38 సెగ్మెంట్లు 2, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వీటితో పాటు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు సైతం ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి.

News August 25, 2025

వీళ్లు భర్తలు కాదు.. నరరూప రాక్షసులు

image

TGలో పలువురు భర్తల వరుస దురాగతాలు ఉలిక్కిపడేలా చేశాయి. HYDలో అనుమానంతో 4 నెలల గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి చంపి, ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అదే అనుమానంతో నాగర్‌కర్నూల్(D) పెద్దకొత్తపల్లిలో భార్య శ్రావణిని భర్త శ్రీశైలం హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కొత్తగూడెంలో లక్ష్మీప్రసన్నను రెండేళ్లుగా కడుపు మాడ్చి చంపేయగా, వరంగల్‌లో భార్య గౌతమిని భర్త ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.