News January 21, 2025
భారత్ నుంచి బ్రిటిషర్లు దోచుకున్న సంపద 64 ట్రిలియన్ డాలర్స్!

మన దేశం నుంచి ఎంత సంపద బ్రిటిషర్లకు చేరిందో తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 1765 నుంచి 1900 సం. మధ్యలో 64.2 ట్రిలియన్ డాలర్లు భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లాయని Oxfam గ్రూప్ తెలిపింది. ఇందులో సగం అంటే 33.8 ట్రి.డా. 10% ధనవంతులే దోచుకున్నారని పేర్కొంది. ఈ డబ్బును లండన్ నగరమంతా 50 పౌండ్ల నోట్లతో పరిచినా ఇంకా 4 రెట్ల కరెన్సీ మిగిలి ఉంటుందని వివరించింది. 1 ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్లతో సమానం.
Similar News
News October 22, 2025
గాయిటర్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి అసాధారణ సైజుకు పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలు. థైరాయిడ్ గ్రంథి ఉబ్బడాన్ని డిఫ్యూస్ గాయిటర్ అని, థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు పెరిగితే నాడ్యులార్ గాయిటర్ అని అంటారు. గొంతు దగ్గర బాగా ఉబ్బినట్లుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన T3, T4, TSH, NFAC చేస్తారు.
News October 22, 2025
గాయిటర్ చికిత్స

థైరాయిడ్ గ్రంథి అయోడిన్ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా దీన్ని ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>