News April 8, 2025
తెల్లదొరల పాలిట సింహస్వప్నమై..

తొలి స్వాతంత్ర్య ఉద్యమ ప్రస్తావన రాగానే గుర్తొచ్చే పేరు మంగళ్ పాండే. భారతీయులను బానిసలుగా మార్చి పాలిస్తున్న తెల్లవారిని ఎదిరించి సిపాయిల తిరుగుబాటుకు పునాది వేశారు. బ్రిటిషర్ల దురాగతాలపై కదం తొక్కి వారి పాలిట సింహస్వప్నంలా మారారు. అదే క్రమంలో తెల్ల దొరలపై దాడి చేయగా పాండేకు ఉరిశిక్ష విధించారు. 1857లో పాండే తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటుగా మొదటి స్వాతంత్ర ఉద్యమంగా మారింది. ఇవాళ ఆయన వర్ధంతి.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


