News May 21, 2024

పల్నాడుని వైసీపీ నేతలు వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల

image

AP: అధికారం కోల్పోతున్నామనే అక్కసుతో YCP నేతలు దాడులకు తెగబడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడుని YCP నేతలు వల్లకాడు చేశారని దుయ్యబట్టారు. కొందరు పోలీసులు YCPతో కుమ్మక్కై TDP కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు, పోలీసులపై YCP ఆరోపణలు చేస్తోందన్నారు.

Similar News

News December 11, 2025

APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

image

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<>SERC<<>>)లో 30 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://serc.res.in/

News December 11, 2025

పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.

News December 11, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.