News May 21, 2024

పల్నాడుని వైసీపీ నేతలు వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల

image

AP: అధికారం కోల్పోతున్నామనే అక్కసుతో YCP నేతలు దాడులకు తెగబడ్డారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడుని YCP నేతలు వల్లకాడు చేశారని దుయ్యబట్టారు. కొందరు పోలీసులు YCPతో కుమ్మక్కై TDP కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో వీడియోలు, ప్రజలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు, పోలీసులపై YCP ఆరోపణలు చేస్తోందన్నారు.

Similar News

News December 17, 2025

విమర్శలకు భయపడేది లేదు: చంద్రబాబు

image

AP: మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ల సదస్సులో CM CBN తెలిపారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. 70% మందికి NTR వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థులకు సీట్లూ పెరుగుతాయని చెప్పారు. గతంలో రూ.500Crతో రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించి డబ్బులు వృథా చేశారని, అవి ఉంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని CM వ్యాఖ్యానించారు.

News December 17, 2025

సేవింగ్స్‌ లేకపోతే ఇదీ పరిస్థితి

image

సేవింగ్స్ విలువను గుర్తు చేసే వాస్తవ కథ ఒకటి SMలో వైరల్‌గా మారింది. 35 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోల్పోయాడు. సదరు కార్పొరేట్ కంపెనీ ఖర్చుల తగ్గింపులో భాగంగా తొలగించేసింది. అయితే అసలు భయం ఏంటంటే అతడి వద్ద ఎటువంటి సేవింగ్స్ లేవు. ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, EMIలు భారం అయ్యాయి. ప్రస్తుత రోజుల్లో ఏ కంపెనీలోనూ ఉద్యోగ భద్రత ఉండదని, యువత ఆ భ్రమ నుంచి బయటకు రావాలని అతడు సూచించాడు.

News December 17, 2025

విశాఖలో పొగమంచు.. ఉమెన్స్ టీమ్ ఫ్లైట్ డైవర్ట్

image

దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన ఫ్లైట్‌ను పూర్ విజిబిలిటీ కారణంగా విజయవాడకు డైవర్ట్ చేశారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్‌ల కోసం మహిళా జట్టు విశాఖకు వెళ్లాల్సి ఉంది. అటు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన మరో విమానం కూడా పొగమంచు కారణంగా క్యాన్సిల్ అయింది.