News April 2, 2024
నేటితో వీరి రాజ్యసభ పదవీకాలం ముగిసింది..

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. వారిలో AP నుంచి ప్రభాకర్రెడ్డి, రమేశ్, కనకమేడల రవీంద్ర, TG నుంచి రవిచంద్ర, లింగయ్య, జోగినపల్లి సంతోష్ ఉన్నారు. వీరి స్థానంలో APలో YCP నుంచి మేడా శివనాథ్, సుబ్బారెడ్డి, బాబూరావు, TGలో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్(INC), వద్దిరాజు రవిచంద్ర(BRS) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Similar News
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <
News November 28, 2025
ఈ విచిత్రాన్ని గమనించారా?

ప్రపంచంలో చాలా చోట్ల భవనాలు, హోటళ్లు, హాస్పిటల్ బిల్డింగ్స్లో 13వ అంతస్తు ఉండదనే విషయం మీకు తెలుసా? ‘ట్రిస్కైడెకాఫోబియా’ వల్ల చాలామంది 13వ అంకెను అశుభంగా భావిస్తారు. ఈ అపోహ వల్ల ఎవరూ 13వ అంతస్తులో ఉండేవారు కాదట. వ్యాపార నష్టం జరగొద్దని నిర్మాణదారులు 13కు బదులుగా 12Aను వేస్తారని వినికిడి. చాలాచోట్ల ICU బెడ్స్కి కూడా 13 లేకుండా 14 రాస్తారని వైద్యులు చెబుతున్నారు. మీరు ఇది గమనించారా?


