News May 4, 2024
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తోంది: మోదీ

గత కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద అని, ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై విలపించేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఝార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన వచ్చాక పరిస్థితి మారింది. ఇప్పుడు సాయం కోసం పాక్ ఏడుస్తోంది. అప్పట్లో ప్రభుత్వం శాంతి పేరిట పాక్కు ప్రేమ లేఖలు పంపితే.. ఆ దేశం ఉగ్రవాదులను పంపేది. ఇప్పుడు అక్కడి ఇళ్లలోకి దూరి టెర్రరిస్టులను చంపేస్తున్నాం’ అని చెప్పారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


