News May 4, 2024

అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తోంది: మోదీ

image

గత కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద అని, ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై విలపించేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన వచ్చాక పరిస్థితి మారింది. ఇప్పుడు సాయం కోసం పాక్ ఏడుస్తోంది. అప్పట్లో ప్రభుత్వం శాంతి పేరిట పాక్‌కు ప్రేమ లేఖలు పంపితే.. ఆ దేశం ఉగ్రవాదులను పంపేది. ఇప్పుడు అక్కడి ఇళ్లలోకి దూరి టెర్రరిస్టులను చంపేస్తున్నాం’ అని చెప్పారు.

Similar News

News September 17, 2025

MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

image

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News September 17, 2025

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.

News September 17, 2025

ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

image

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్‌లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్‌లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.