News May 4, 2024

అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తోంది: మోదీ

image

గత కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద అని, ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై విలపించేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన వచ్చాక పరిస్థితి మారింది. ఇప్పుడు సాయం కోసం పాక్ ఏడుస్తోంది. అప్పట్లో ప్రభుత్వం శాంతి పేరిట పాక్‌కు ప్రేమ లేఖలు పంపితే.. ఆ దేశం ఉగ్రవాదులను పంపేది. ఇప్పుడు అక్కడి ఇళ్లలోకి దూరి టెర్రరిస్టులను చంపేస్తున్నాం’ అని చెప్పారు.

Similar News

News February 9, 2026

అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీ: సీఎం

image

AP: రాష్ట్రంలో ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘అమరావతిలో రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే వాటిని ప్రపంచానికి అందిస్తాం. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లుతోంది. మనమూ ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులు నెలవారీగా సమీక్షలు చేసుకోవాలి’ అని సూచించారు.

News February 9, 2026

నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే వారు చెప్పింది నిజమవుతుందా?

image

నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు ఏది చెబితే అది నిజం అవుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఇలా ఉండటం ఓ దైవిక సంకేతమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. వీరు గత జన్మలో చేసిన పుణ్యాల వల్ల ఈ గుర్తులు వస్తాయట. అలాగే మృదు స్వభావులై ఉంటారట. సైన్స్ పరంగా.. ఇవి కేవలం మెలనిన్ కణాల కూర్పు మాత్రమే. వారు బాధలో అన్న మాటలు నిజమవుతాయనే నమ్మకం వెనుకున్న అసలు ఉద్దేశం.. మానసికంగా ఇబ్బంది పెట్టకుండా గౌరవించడమే.

News February 9, 2026

వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.