News January 14, 2025
అప్పుడు లేఖ రాయడానికి తుమ్మలకు పెన్ను దొరకలేదా?: అర్వింద్

TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.
Similar News
News February 4, 2026
BRS ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి: రేవంత్

TG: పార్టీ టికెట్ ఒక్కరికే వస్తుందని, అందరూ ఐక్యంగా విజయానికి పనిచేయాలని CM రేవంత్ మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతలకు సూచించారు. అభ్యర్థులు అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. ‘ప్రతి ఓటూ ముఖ్యమే. ఇంటింటికీ తిరిగి ఓట్లడగాలి. ఈ ఎన్నికల్లో BRS ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి’ అని సూచించారు. మాజీ MLA భాస్కర్ రావు నమ్మకద్రోహి అని విమర్శించారు. గెలుస్తామన్న నమ్మకంతో ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించానని వివరించారు.
News February 4, 2026
APR 30న రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్: బుచ్చిబాబు

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. మార్చి 27న రావాల్సిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు బుచ్చిబాబు X వేదికగా ప్రకటించారు. షూటింగ్ పూర్తికాకపోవడంతో పాటు ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News February 4, 2026
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

AP: చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. గుంటూరులోని అంబటి ఇల్లు, ఆఫీసును పరిశీలించారు. అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


