News January 14, 2025
అప్పుడు లేఖ రాయడానికి తుమ్మలకు పెన్ను దొరకలేదా?: అర్వింద్

TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.
Similar News
News September 8, 2025
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఇవాళ గ్రీన్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 80,904 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు వృద్ధి చెంది 24,802 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్, HDFC, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, BEL, ట్రెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, L&T, ఎయిర్టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News September 8, 2025
రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు NDA, INDI కూటమి సిద్ధమవుతున్నాయి. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విపక్ష ఎంపీలకు ఇండి కూటమి మాక్ పోలింగ్ నిర్వహించనుంది. దీనికి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. అటు AP మంత్రి నారా లోకేశ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. NDA అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతుగా తమ TDP ఎంపీలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నికకు BRS దూరంగా ఉండే అవకాశం ఉంది.
News September 8, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్!

TG: స్టీల్, సిమెంట్పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.