News January 14, 2025

అప్పుడు లేఖ రాయడానికి తుమ్మలకు పెన్ను దొరకలేదా?: అర్వింద్

image

TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్‌కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.

Similar News

News February 6, 2026

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>పంజాబ్<<>> నేషనల్ బ్యాంక్‌ 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత గలవారు FEB 8 – 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వయసు 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, DV, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pnb.bank.in

News February 6, 2026

గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

image

దేశంలో ఉద్యోగ మార్కెట్‌ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్‌ పేజ్‌ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్‌-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్‌ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్‌ హెడ్స్‌కు డిమాండ్‌ పెరిగిందని తెలిపింది.

News February 6, 2026

ఆఫీస్‌ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

image

TG: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల నుంచి డిమాండ్‌ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.